అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా: విజయసాయిరెడ్డి

-

అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా: విజయసాయిరెడ్డి
టీడీపీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రిపై వైసీపీ ఎంపీ, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు విశాఖ పర్యటనను నిన్న పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో పంపించేశారు. వాస్త‌వానికి చంద్రబాబు ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ.. బాబుకు స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు.

మరోవైపు వైసీపీ శ్రేణులు బాబు పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. వైసీపీ కార్యకర్తలు బాబు కాన్వాయ్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలోనే రోడ్డు మీద బైఠాయించి చంద్ర‌బాబు నిర‌స‌న తెలిపారు. అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గరి ముద్దను లాక్కునేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ‘ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సీఎం జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?’ అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news