14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు: విజ‌య‌సాయిరెడ్డి హాట్ కామెంట్స్‌

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు.. ప్ర‌స్తుతం తమ పార్టీ శ్రేణులను మరింత ఉత్తేజ పరిచే దిశగా `ప్రజా చైతన్య యాత్ర` పేరిట రాష్ట్రం అంతా చుట్టేస్తూ ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను మరింత పెంచే దిశగా ఈ యాత్రలు కొనసాగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ నేత‌ల‌పై చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడు, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఫ్లెక్సీలపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ తీరు సరికాదని చెబుతూ ట్వీట్ చేశారు.

‘వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news