ప్రముఖ నిర్మాణ సంస్థ ట్వీట్.. తలలు గోక్కుంటున్న నెటిజన్స్

-

తెలుగు చిత్ర సీమలో వైజయంతీ మూవీస్‌కు ఉన్న విశిష్టత, కీర్తి ప్రతిష్టలు అందరికీ తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారక రామారావు చేతుల మీదుగా మొదలైన ఈ బ్యానర్‌పై ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు వచ్చాయి. బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వైజయంతీ మూవీస్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ఇండస్ట్రీ హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర వంటి ఎవర్‌గ్రీన్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి.

మహానటితో ఒక్కసారిగా..

 


అయితే ఆ మధ్య దూకుడు తగ్గించిన ఈ బ్యానర్‌పై గొప్ప చిత్రాలేవీ రాలేదు. కానీ మహానటి వంటి చిత్రాన్ని ఎప్పుడైతే నిర్మించారో.. మళ్లీ వైజయంతీ మూవీస్‌కు పూర్వ వైభవం వచ్చింది. కానీ మళ్లీ ఆ రేంజ్ సక్సెస్‌ను కొట్టలేకపోయింది. చివరగా నాగార్జున, నాని కాంబినేషన్‌లో దేవదాస్ చిత్రాన్ని నిర్మించినా..అది అంతగా వర్కౌట్ కాలేదు. ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. మహేష్ బాబు మహర్షి చిత్రంలో భాగస్వామిగా మాత్రమే ఉంది. సోలో నిర్మాత కాకపోవడంతో అంత పేరు రాలేదు. మళ్లీ ఇన్ని రోజులకు ఆ సంస్థ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది..

వైజయంతీ సంస్థ ట్వీట్..

 


మహానటి చిత్రాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్‌తోనే మరో ప్రాజెక్ట్ రాబోతోందని టాక్. ఈ మేరకు వైజయంతీ సంస్థ ఓ ట్వీట్ చేసింది. కొన్ని గంటల్లోనే ఓ సర్‌ప్రైజ్ రాబోతోందని ప్రకటించారు. దీంతో నెటిజన్లు తమకు ఇష్టమొచ్చిన కాంబినేషన్, హీరోల చిత్రాల గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఒకరేమో ఎన్టీఆర్-అట్లీ అంటారు.. మరొకరేమో పవన్ కళ్యాణ్ 29వ చిత్రమంటారు.. ఇంకొకరేమో మహేష్ బాబు చిత్రమా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారో తెలీక తలలు గోక్కుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news