జగన్ గారు… శవరాజకీయాలు ఎవరు చేసారో తెలుసు…!

-

300 రోజులుగా ఉద్యమం చేస్తున్న మహిళలు, రైతులకు అభినందనలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. కేసులకు భయపడకుండా పిల్లలు, మహిళలు, వృద్దులు అమరావతి కోసం పోరాడుతున్నారు అని ఆయన అన్నారు. ఆనాడు శాసన సభలో చర్చ జరుగుతున్న సమయంలో జగన్ రెడ్డి అమరావతి రాజధాని కి 30వేల ఎకరాలు కావాలన్నారు అని గుర్తు చేసారు.

lokesh
lokesh

ఇప్పుడు మాట మార్చి, మడమ తిప్పి.. మోసం చేశారు అని మండిపడ్డారు. న్యాయం కోసం ఉద్యమం చేస్తున్న వారిని మంత్రులు తో తిట్టిస్తున్నారని అన్నారు. రాజధాని కోసం చనిపోతే రైతులను పరామర్శించే మనసు కూడా జగన్ కు లేదని పేర్కొన్నారు. మమ్మలను మాత్రం శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తారని, తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని శవ రాజకీయం చేసింది ఎవరో అందరకీ తెలుసని అన్నారు. జగన్ తన వ్యక్తిగత స్వార్ధం కోసం అన్ని ప్రాంతాల ప్రజలను మోసం‌ చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news