నిజామాబాద్ ఎమ్మెల్యే కారు డ్రైవర్, గన్‌మన్‌కు కరోనా..!

-

తెలంగాణలో కరోనా రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే దీని బారిన వేల మంది పడగా.. దాదాపు 200 మంది  మరణించారు. అలాగే మంత్రులకు సైతం దీని సెగ తగలడంతో వారు ఇళ్ళకే పరిమితం అయ్యారు. అలాగే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అందులో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆయన భార్య కూడా ఉన్నారు, అయితే తాజాగా ఆయన కారు డ్రైవర్, గన్‌మన్‌ కు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని క్వారంటైన్‌కు పంపినట్టు తెలుస్తోంది. కాగా, జిల్లాకు చెందిన ఓ ఫోటో జర్నలిస్టుతో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన భార్య, కుమార్తెకు కూడా వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news