రీపోలింగ్ నిర్వహించాల్సిందే.. పరిటాల సునీత డిమాండ్

-

ఏపీలో ఎన్నికలు అంతా గందరగోళం జరుగుతున్నాయంటూ టీడీపీ నేతలు ఇప్పటికే ఈసీ ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల్లో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలు శృతి మించుతున్నాయని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. మా ఏజెంట్లను కనీసం పోలింగ్ కేంద్రానికి కూడా అనుమతించడం లేదు. వైఎస్సార్సీపీ నేతలను మాత్రం అనుమతిస్తున్నారు. మా కార్యకర్తలు, నేతలు, అభిమానులపై ఇన్ని దాడులు జరుగుతున్నా పోలీసులు, అధికారులు ఎందుకు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.



ఈవీఎంలు చాలా చోట్ల పని చేయడం లేదు. కొన్ని మండలాల్లో వృద్ధులకు, మహిళలకు కనీస సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయలేదు. ఎన్నికల కమిషన్ మళ్లీ పోలింగ్ నిర్వహించాల్సిందేనంటూ పరిటాల సునీత డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news