పవన్ డిమాండ్.. ఆ పరీక్షలు కూడా రద్దు చేయండి..!

-

కరోనా తీవ్రత దృష్ట్యా ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విధంగానే డిగ్రీ, పీజీ, బీటెక్ తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశారు. పరీక్ష సెంటర్లు, కళాశాలలు, హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశం ఉందని అందుకే డిగ్రీతో పాటు మిగిలిన పరీక్షలను కూడా రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రల్లో డిగ్రీ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భవితవ్యం దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేయాలని కోరారు. కాగా, పదో తరగతి పరీక్షలు రద్దు చేయమని ఆయన మొదటి నుంచి ప్రభుతాన్ని కోరుతూనే ఉన్నారు. అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దీనిపై స్పందించిన పవన్, జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news