బ్రేకింగ్ : రాజమండ్రికి చేరుకున్న పవన్… సభకు గ్రీన్ సిగ్నల్

-

తూర్పుగోదావరి జిల్లా : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. రాజమండ్రి కి చేరుకున్నారు. ఉత్కంఠత పరిస్థితుల్లో కాసేపటి క్రితమే..రాజమండ్రికి చేరుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఈ నేపథ్యంలో భారీ సంఖ్య లో రాజమండ్రి ఎయిర్‌ పోర్టు చేరుకున్నారు. ఎయిర్‌ పోర్టు కాసేపటి క్రితమే పవన్‌ కళ్యాణ్‌.. భారీ ర్యాలీ తో భయలు దేరారు పవన్‌ కళ్యాణ్‌.

ఇక అటు పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభకు పోలీసులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రాజమండ్రి లో జనసేన శ్రమదానం కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావడానికి ఎటువంటి అడ్డంకులు లేవని రాజమండ్రి ఏఎస్పీ కె. లతా మధురి తెలిపారు.

పవన్ కళ్యాణ్ నేరుగా సభా ప్రాంగణానికి విచ్చేసి ప్రసంగిస్తారని ఆమె వెల్లడించారు. జన సేనికులను పోలీసులు అడ్డుకుంటున్నారని అనడం అవాస్తవమని ఆమె తేల్చి చెప్పారు.  పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కోసమే బారికెడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా నియమాలు పాటిస్తూ.. బహిరంగ సభలో పాల్గొనాలని వెల్లడించారు ఏఎస్పీ కె. లతా మధురి.

Read more RELATED
Recommended to you

Latest news