పవన్‌ కళ్యాణ్‌ టీడీపీ దత్తపుత్రుడే.. నిజం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు

-

పవన్‌కళ్యాణ్‌ని టీడీపీ దత్తపుత్రుడని పదే పదే చెబుతున్నారు ఏపీలోని అధికార వైసీపీ నేతలు. ఈనాడు,ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తే ఇది నిజమని అర్థమవుతోంది.జగన్‌ను పంపించేద్దాం అని ఈనాడులో హెడ్డింగ్ పెట్టి పవన్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు.అలాగే ఓటర్లు కులాలవారీగా విడిపోవద్దు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇవన్నీ చూస్తే ఎవరి అజెండా కోసం పవన్ ప్రజల మధ్యలోకి వచ్చారో అర్ధమైపోతుంది.గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన ఓ వ్యక్తిని ఈ రెండు పత్రికలు పతాక శీర్షికలకు తీసుకువెళ్లారంటే పవన్‌ని ఎంతలా వారు హైలైట్‌ చేస్తున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

పవన్ కల్యాణ్ ఇప్పటికే చంద్రబాబు ఇంటికి వెళ్లి సీట్లు, ప్యాకేజీలపై మాట్లాడుకున్నాడు. వారాహి యాత్రలో ఏ రోజు ఏం మాట్లాడాలో బాబు డైరెక్షన్‌ ఇస్తున్నారు.తాను ఎమ్మెల్యే కావాలంటూ పవన్‌ చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి స్ర్కిప్టూను సంద్రబాబు శిబిరం నుంచే పంపిస్తున్నారు. అంటే.. సీఎం రేసులో పవన్ లేడని పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ నిరాశపడి వెనక్కి వెళ్లిపోతున్నారని అర్థంకాగానే ఎలాగూ టీడీపీతో కలిసే వెళ్తాడు కాబట్టి మీరు చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటూ మరో డైలాగ్‌ కూడా టీడీపీయే పవన్ కల్యాణ్‌తో చెప్పిస్తోంది. జగన్‌ పాలనపై పవన్ కల్యాణ్‌ నోటికి వచ్చినట్లు మాట్టాడుతున్నాడు. ఈ వ్యాఖ్యల్లో నిజం ఉంటే.. పవన్ కల్యాణ్‌ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయొచ్చు.మరి ఆ పని ఎందుకు చేయటం లేదు. రాష్ట్రం మొత్తం మీద టీడీపీ చెప్పినట్లు సెలక్టివ్‌గా పోటీ చేసి వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఎన్ని ఓట్లు తగ్గుతాయో తన చిలకతోనో, ఎలకతోనో ఒక జ్యోతిష్యం చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు పవన్‌.

వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికే 2.16 లక్షల కోట్ల డీబీటీ జరిగిందా? లేదా? ఇటువంటి మేలు చరిత్రలో ఎప్పుడైనా ఇంటింటికీ జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టే.. ఇసుక, మద్యం అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇక, క్లాస్‌వార్‌కు సంబంధించి పవన్‌ కల్యాణ్‌కు చారుమంజుదార్‌, తరిమెల నాగిరెడ్డి గుర్తుకు వచ్చారు. చంద్రబాబే ఆయనకు చేగువేరా. నారాజమిందారే చారుమంజుదార్. పుచ్చిన బుర్ర కలిగిన చంద్రయ్యే పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన ఇచ్చే తీర్థం, ప్రసాదం, పుష్పం, ఫలం, గోదానం, భూదానం అన్నీ అందుకుని పార్టీ ఆఫీసు, వ్యక్తిగత సెటిల్‌మెంట్లు అన్నీ చేసుకున్నాడు కాబట్టే.. ఇప్పుడు ఈ నారా జమీందార్‌, ఈ చంద్రగువేరా అనేవాళ్ళు అత్యంత ప్రీతిపాత్రులుగా కనిపిస్తున్నారు పవన్‌కి.

బాబు ఫిలాసిఫీయే పవన్‌ ఖులాసఫీ. కాబట్టి, ఎల్లో మీడియాను పిలుచుకుని వారికి ఏం కావాలంటే అది చెబుతాడు. వారు రాస్తారు.. ప్రచురిస్తారు.ఇదే పవన్‌ కల్యాణ్‌ గతంలో ఎల్లో మీడియా గురించి ఏం మాట్లాడారో గుర్తు చేసుకుంటే ఈ ఇంటర్వ్యూలు మొదటి పేజీలో వేసిన పత్రికలు కనీసం సిగ్గుపడేవి. పవన్ కల్యాణ్‌కి నాలుక మడతేయటం చాలా ఈజీ, ఎల్లో మీడియాకు అతన్ని వాడుకోవటం అంతకన్నా ఈజీ.పవన్‌ కల్యాణ్‌ను హత్య చేయటానికి లేదా అంతమొందించటానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇదే ప్యాకేజీ స్టార్ అప్పట్లో ఆరోపిస్తే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం మీద అవే ఆరోపణలు చేశాడు.

అన్ని పార్టీలు ఏకం కావాలంటూ కులాల పరంగా విడిపోవద్దని పవన్ కల్యాణ్‌ అన్నట్టుగా రాశారు. సీఎం జగన్ పాలన బాగోలేదనుకుంటే.. కూటములతో పనేంటి? 2019లో చంద్రబాబును రక్షించటానికి విడిగా వెళ్లిన పవన్ కల్యాణ్‌ తాను మునిగాడు తప్ప వ్యతిరేక ఓటు ఉన్నప్పుడు అధికార పార్టీని ఈ జిమ్మిక్కులతో ఓడించలేం కదా. నిజంగా వ్యతిరేక ఓటు ఉంటే.. వీరంతా విడిగా పోటీ చేయటంలో ఎందుకు వెనకాడుతున్నట్లు. మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టే.. పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు. పొత్తులు పెట్టుకోవటానికి ఒక సైద్ధాంత బలం లేదు కాబట్టే.. వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అంటూ ఒక డైలాగ్ అందుకున్నారు. ఇంతకు మించి వీళ్ళ రాజకీయంలో నీతి లేదు, నిజాయితీ లేదు, అభివృద్ధి లేదు. ప్రజా ప్రయోజనం అంతకన్నా లేదు. దోచుకుందాం.. పంచుకుందాం.. తినుకుందాం అనే నినాదాల కలయికగానే మూడు నాలుగు పార్టీలు కలసి రావాలని పవన్ కల్యాణ్‌ కోరుకుంటున్నాడు. అసలు పదేళ్లు ఈ స్టేట్‌లోనే తన కుటుంబంతో వచ్చి ఒక్కరోజు కూడా లేని పవన్‌ రాష్ర్ట ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే ఎవరైనా నమ్ముతారా.

Read more RELATED
Recommended to you

Latest news