క్యాసినోలో కొత్త ట్విస్ట్.. కొడాలికి రఘురామ సపోర్ట్..!

-

గత రెండు, మూడు రోజులుగా గుడివాడలో క్యాసినో వ్యవహారంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన కళ్యాణ మండపంలో ఈ క్యాసినో నిర్వహణ జరిగిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు బయటకొచ్చాయి. ఈ అంశంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. గుడివాడలో గోవా కల్చర్ తీసుకొచ్చారని, యువతని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాగే నిజనిర్ధారణ కమిటీ పేరిట కొందరు టీడీపీలో నేతలు గుడివాడలో పర్యటించడం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడం జరిగిపోయాయి.

ఇక ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లో కరోనాకు చికిత్స తీసుకుని వచ్చిన కొడాలి నాని స్పందిస్తూ.. అసలు క్యాసినో తనకు సంబంధం లేదని, పండగ రోజు అమ్మాయిలతో డ్యాన్సులు, క్యాసినో అంటూ వార్తలు వస్తే తానే డీఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడారు.

అయితే కొడాలి పాత్ర ఉందని నిరూపిస్తామని, నిరూపించలేకపోతే తాము పెట్రోల్ పోసుకుంటామని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఇదే క్రమంలో ఈ వ్యవహారంపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. క్యాసినో నిర్వహించిన మాట వాస్తవమే అని, కానీ ఇందులో కొడాలి ప్రమేయం లేదని, పైనున్న వైసీపీ పెద్దలు ఎవరైనా చేసి ఉంటారని మాట్లాడారు. కానీ క్యాసినోతో కొడాలికి ఎలాంటి సంబంధం లేదని మనస్ఫూర్తిగా చెబుతున్నానని అన్నారు.

ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన సమయంలో ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ కరెక్ట్ కాదని, ఎవరు కూడా ఈ డైవర్షన్ గేమ్‌లో పడొద్దని సూచించారు. అంటే పరోక్షంగా టీడీపీకి చెప్పినట్లు కనిపిస్తోంది. టీడీపీనే ఈ క్యాసినో వ్యవహారాన్ని భుజాన వేసుకుంది. మొత్తానికైతే అందరినీ ఆశ్చర్యపరుస్తూ… రఘురామ, కొడాలికి సపోర్ట్ చేయడం కొత్త ట్విస్ట్.

Read more RELATED
Recommended to you

Latest news