జనం మధ్యే భట్టి.. భట్టి పాదయాత్రపై రాహుల్ ఆరా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ

-

పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వన్నె తెచ్చిన ఘనత ఆయనది.అన్న చాటు తమ్ముడిలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్నారు తెలంగాణ సీఎల్ఫీ నేత మల్లు భట్టి విక్రమార్క. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన వైఖరితో ప్రత్యేక గుర్తింపు పొందారు.ఒకప్పుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ప్రధాన అనుచరుడిగా పేరు పొంది వివిధ పదవుల్లో కొనసాగారు. వైఎస్ సీఎం కాక ముందు తెలంగాణలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. సమస్యలు చెప్పుకుందామని వెళితే ప్రజలను పోలీసులతో కొట్టించిన సంఘటనలు ఉన్నాయి.అంతటి మరచిపోలేని దుర్దినాలు ఉండేవి అప్పటి చంద్రబాబు పాలనలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయింది.

తెలంగాణ ప్రాంతంలో అయితే పరిస్థితులు మరింత కష్టంగా ఉండేవి. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ కన్నీటి చెమ్మతోనే దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదిగో అప్పుడే పీడిత ప్రజల పాలిట దేవుడిగా కనిపించిన పాదయాత్రతో ప్రజల వద్దకు వచ్చాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి!తన మనస్సుల్లాగే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన రైతుల్ని తలపించే పాగా, కాళ్లకి స్పోర్ట్స్ షూ… ఇది అప్పుడు పాదయాత్రలో వైఎస్ఆర్ ఆహార్యం. అలా పాదయాత్రలో వచ్చి ప్రజల పాలిట పెన్నిధిగా మారాడు రాజశేఖర్ రెడ్డి. అచ్చు అలాంటి రూపం ఎక్కడ కనిపించినా ఇప్పటికీ మనకు పెద్దాయనే గుర్తుకు వస్తారు. అటువంటి సందర్భమే మరోసారి వచ్చింది తెలంగాణ నేలపై.

అప్పుడు చంద్రబాబు లాగే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో అరాచక పాలన సాగిస్తున్నారు.నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎదురుచూసిన తెలంగాణ ప్రజానీకానికి తొమ్మిదేళ్లుగా కన్నీళ్లే మిగిలాయి. వారి చెమర్చిన కళ్లు తుడవటానికే మధిర ఎమ్మెల్యే జన నేత భట్టి విక్రమార్క పట్టుబట్టి బయలుదేరారు. వేయి కిలో మీటర్లు దాటి వంద రోజుల మైలు రాయిని త్వరలో చేరుకోబోతున్నారు! ఆనాటి రాజశేఖర్ రెడ్డి లాగే ఇంటి నుంచీ బయలుదేరి నిర్విరామంగా జనం మధ్య గడుపుతోన్న భట్టికి జూన్ 15న ఆయన బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ కాల్ వచ్చింది! అది మరెవరి నుంచో కాదు…

ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియమ్మ తనయుడు దిల్లీ నుంచీ ఫోన్ చేశారు! భట్టికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. గల్లీ నుంచీ దిల్లీ దాకా చర్చగా మారిన పీపుల్స్ మార్చ్… రాహుల్ ను కూడా ఆకర్షించింది. జనం కోసం జన నేత భ్టటి విక్రమార్క చేస్తోన్న పోరాటం ఆయన చేత ఫోన్ చేయించింది. తెలంగాణలో సామాన్య జనం బాగోగుల గురించి ఆరా తీయించింది! ప్రజల కోసం ఆరాటపడుతోన్న నాయకుడికి అండగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంటుందని ఆయన అన్నట్లు సమాచారం. మొత్తంగా భట్టి పాదయాత్ర ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది! రాహుల్ నుంచీ ఫోన్ రావటంతో భట్టి విక్రమార్క మరింత ధృఢ సంకల్పంతో ముందుకు దూసుకుపోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news