మోడీ వస్తే.. నన్ను ఇంత అవమానిస్తారా : రేవంత్

-

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయిన విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బిజెపి.. ఢిల్లీ పెద్దలను కూడా రంగంలోకి దింపుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ లో మోడీ పర్యటన పై స్పందించిన మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

స్థానిక ఎంపీనీ అయిన తనకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నుంచి ఆహ్వానం రాకపోవడం.. కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం దారుణం అంటూ వ్యాఖ్యానించారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. హైదరాబాదులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వ్యక్తిగతం కాదని.. అలాంటిది ఒక ప్రజా ప్రతినిధి అయిన తనకు ఆహ్వానం అందకపోవడం దారుణం అంటూ వ్యాఖ్యానించాడు. ఇది కచ్చితంగా ప్రోటోకాల్ ఉల్లంగన అంటూ ఆరోపించాడు. ఈ విషయాన్ని తప్పకుండా లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి నిరసన తెలియ జేస్తాను అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news