కుమార్తె కోరిక తీర్చిన మంత్రి స్మృతి ఇరానీ.. ఏ విధంగానూ తెలుసా..?

-

న‌టి నుంచి రాజ‌కీయ నాయ‌కురాలిగా మారిన స్మృతి జుబిన్ ఇరానీ ప‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అంటే సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటారు. తన వాక్చాతుర్యం కావొచ్చు, విద్యార్థులు, సామాజిక సమస్యలు, పొలిటికల్ అంశాలు ఏవైనా కావొచ్చు స్మృతి ఇరానీ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే కేంద్రమంత్రిగా ఊపిరిసలపని పనులతో బిజీగా ఉండే స్మృతి ఇరానీ కుమార్తె కోసం సాధారణ గృహిణిగా మారిపోయారు. కుమార్తె అడిగిందని ఇష్టమైన వంటలు చేసిపెట్టారు.

తనకు ఇష్టమైన వంటలు చేసి పెట్టమని కుమార్తె జోయిషి ఇరానీ అడగ్గానే గరిటె చేతపట్టిన మంత్రి పలు రకాల వంటలు చేసి కుమార్తెకు తినిపించారు. ఆ త‌ర్వాత అంతేకాదు, ఆ వంటలు, వాటి వివరాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. వెజ్ హక్కా నూడుల్స్, చికెన్ మంచూరియా వంటి పలు వంటకాలు చేసిన స్మృతి.. వాటి తయారీ విధానాన్ని కూడా స్పష్టంగా వివరించారు. ఇవి చూసిన నెటిజ‌న్లు భేష్ అంటూ కొనియాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news