శ్రీ శైలం ప్రమాదం అందుకేనా…కీలక అంశాలను గుర్తించిన సీఐడీ !

-

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్ర ప్రమాదం పై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో పలు సెక్షన్ లను అదనంగా చేర్చారు. ప్రమాదం లో సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల మీద దృష్టి సారించిన సీఐడీ, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రమాద తీవ్రతను పెంచిందని గుర్తించింది.

srisailam-dam
srisailam-dam

అలానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనాన్ని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఎందుకు ఫైర్ నిబంధనలు పాటించలేదన్న దానిపై విచారిస్తోంది సీఐడి. 240 మేగవాట్ల ట్రాన్స్ఫార్మర్స్ బ్లాస్ట్ అయిన నేపద్యంలో దాన్ని కంట్రోల్ చేయడానికి సరైన పరికరాలు చేపట్టలేదని గుర్తించింది సీఐడి. అలానే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్పెషల్ రెస్క్యూ టీమ్ లేకపోవడం పై ప్రమాద తీవ్రత ను పెంచిందని సీఐడీ గుర్తించింది. యాజమాన్యం సరి పడినంత రక్షణ చర్యలు తీసుకోకపోవడం వలనే ప్రమాదం తీవ్రత పెరిగిందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news