విజయసాయి రెడ్డికి ఆ రోగం వచ్చిందేమో: టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

-

ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి కి మాజీ మంత్రి,టిడిపి నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. మతిమరుపు రోగం వచ్చిందా ఏంటి వీసా రెడ్డి ? వ్యవసాయ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చింది మర్చిపోయావా? అని నిలదీశారు. ఈ బిల్లుని సమర్ధించని వాళ్ళు అందరూ దళారీలు అంటూ వ్యాఖ్యలు చేసి, రాజ్యసభలో అందరి చేత బూతులు తిట్టించుకుంది మర్చిపోయావా ? అని నిలదీశారు.

ఎక్కడైనా నీ ప్రసంగంలో “స్వామినాథన్ కమిటీ ” పేరు ఎత్తావా ? తెలుగుదేశం పార్టీ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది అన్నారు. కార్పొరేట్ ల ఆధిపత్యం మద్దతు ధర, మార్కెట్ల పటిష్టత గురించి, కాంట్రాక్టు ఫార్మింగ్ వల్ల రైతులు ఎలా నష్టపోయేది, ఇలా అనేక అంశాల పై తెలుగుదేశం పార్టీ కీలక సూచనలు ఇచ్చిన సంగతి మర్చిపోయావా ? అని ఆయన ప్రశ్నించారు. బేషరతుగా మద్దతు ఇచ్చి, ఇప్పుడు నాటకాలు ఆడతారా ? ఇందుకు కాదు మిమ్మల్ని ఫేక్ ఫెల్లోస్ అనేది అని ఎద్దేవా చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news