చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరనున్న…!

-

ఏపీలో ఎన్నికలు ఇంకా 10 రోజులే ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీలోకి చేరికలు ఆగడం లేదు. టీడీపీ షాక్ లు తగలడం ఆగడం లేదు. టీడీపీకి ఎదురుదెబ్బలు తాకుతూనే ఉన్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబుకు తన సొంత జిల్లాలోనే భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఆయనకు టీడీపీకి చెందిన ముఖ్య నేతలు షాక్ ఇచ్చి వైఎస్సార్సీపీలో చేరారు. తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు టీడీపీకి షాక్ ఇచ్చారు. ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. ఇవాళ గూడూరులో జరిగే జగన్ ప్రచార సభలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.

tdp leader SCV Naidu to join in ycp today

టీడీపీకి నేను ఎంతో సేవ చేశా. అయినప్పటికీ తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ ను చంద్రబాబు ఇవ్వలేదు. నాకు ఇస్తానని చెప్పి చంద్రబాబు మాట తప్పారు. దీంతో నేను మనస్థాపం చెందా. ఇవాళ జగన్ సమక్షంలో నా అనుచరులతో సహా వైసీపీలో చేరుతున్నా. జగన్ గెలుపు కోసం కృషి చేస్తా.. అని ఆయన తెలిపారు. దీంతో ఎస్సీవీ నాయుడితో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.



ఏపీలో ఎన్నికలు ఇంకా 10 రోజులే ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీలోకి చేరికలు ఆగడం లేదు. టీడీపీ షాక్ లు తగలడం ఆగడం లేదు. టీడీపీకి ఎదురుదెబ్బలు తాకుతూనే ఉన్నాయి. చూద్దాం.. ఇది ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news