చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

-

టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదన్నారు. టీడీపీలో ఉన్న 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విషయంలో తనకు కొన్ని అభ్యంతరాలున్నాయంటూ షాకిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదన్నారు. టీడీపీలో ఉన్న 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికలో చంద్రబాబు గెలవడం కష్టమేనని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేలను మార్చకుండా.. వారికే మళ్లీ టికెట్ ఇస్తే ఆ దేవుడే దిక్కు అంటూ జేసీ వ్యాఖ్యానించారు.

tdp mp jc divakar reddy shocking comments on chandrababu

మరోవైపు.. దేశ రాజకీయాల గురించి కూడా జేసీ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో ఇటువంటి పరిస్థితులే ఉంటే.. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవడం ఖాయం అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news