తెలంగాణలో కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గత 24 గంటల్లో 209 కొత్త కేసులు వెలుగు చూశాయి. వీటిలో 208 లోకల్ కేసులు కాగా, బయటి నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఒక కేసును గుర్తించారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 175 మందికి కరోనా నిర్ధారణ అయింది. అంతేకాదు, రాష్ట్రంలో మరో 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 165 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,320కి చేరింది. 1,993 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 2,162 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్క రోజులోనే..!
-
Previous article
Read more RELATEDRecommended to you
మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ వ్యక్తి అత్యవసర...
Ganesh -
గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది.. చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తది : కేటీఆర్
కరీంనగర్ లోక్సభ పరిధిలోని కోనరావుపేటలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్...
Ganesh -
తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడా : కేసిఆర్
భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Ganesh -