తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్క రోజులోనే..!

-

తెలంగాణలో కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యతో ప్రజలు భయాందోళనకు  గురైతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గత 24 గంటల్లో 209 కొత్త కేసులు వెలుగు చూశాయి. వీటిలో 208 లోకల్ కేసులు కాగా, బయటి నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఒక కేసును గుర్తించారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 175 మందికి కరోనా నిర్ధారణ అయింది. అంతేకాదు, రాష్ట్రంలో మరో 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 165 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,320కి చేరింది. 1,993 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 2,162 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news