బ్రేకింగ్: జగన్ కేసులపై నేడు విచారణ

-

ఏపీ సీఎం ఆస్తుల కేసులో నేడు సీబీఐ కోర్ట్ లో విచారణ జరగనుంది. గత విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని కోరారు జగన్ తరపు న్యాయవాది. జగన్ కు సంబంధించిన నాలుగు కేసుల స్టే లు పై దూకుడు పెంచింది సిబిఐ న్యాయస్థానం. హెటిరో, అరబిందోలకు భూ కేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నాఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్‌కు లీజులు ఇచ్చిన కేసులపై విచారణ జరుగుతుంది.

jagan
jagan

అరబిందో, హెటిరో సంస్థలకు క్విడ్‌ ప్రొ కో పై ఈడీ కేసు నమోదు చేసారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఇందూ గ్రూపు, వాన్‌ పిక్‌ కు భూకేటాయింపులుపై 11 కేసులు నమోదు చేసింది సీబీఐ. స్టే ఉన్న కేసులను, మిగిలిన కేసులు మొత్తం కలిపి విచారణ చేయనుంది సిబిఐ కోర్ట్. అయితే జగన్ విచారణకు హాజరు కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news