బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

-

టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 20 లేదా 21వ తేదీల్లో దిల్లీలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర నేతలు ఈనెల 19న ముందుగా.. బూరనర్సయ్య గౌడ్ తో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు ఈనెల 19న నర్సయ్యగౌడ్​ ఇంటికి వెళ్లి సమావేశం కానున్నారు. తరువాత దిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ పెద్దల సమక్షంలో ఈనెల 20 లేదా 21న బీజేపీలో చేరనున్నారు.

ఈ నెలాఖరున 27 లేదా 28న హైదరాబాద్​ శివారులో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించనుంది. ఆ సభలో బూర నర్సయ్య వర్గీయులు కమలం పార్టీలో చేరనున్నారు. ఆ సభకు పార్టీ ముఖ్య నేత హాజరయ్యే అవకాశం ఉంది. ఆదివారం రోజున టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బూరనర్సయ్య గౌడ్.. అందుకు గల కారణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news