వేణుస్వామి చెప్పినట్లు పవన్ కళ్యాణ్ కు ఆ ప్రమాదం తప్పదా?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజిగా ఉన్నాడన్న విషయం తెలిసిందే..ఈసారి ఏపీలో జరగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలో తీసుకురావాలని కష్ట పడుతున్నారు..ఈ మేరకు ఏపీలో పలు ప్రాంతాలలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకోనె ప్రయత్నం చేస్తున్నారు..అందులో భాగంగా మిన్న వైజాగ్ లో కూడా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు..కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమం జరగలేదు.కానీ పవన్ కల్యాణ్ పాపులారిటీ మాత్రం పెరిగింది.

ఇది ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ కు గత కొద్ది రోజుల నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి..అయితే,అందుకు కారణం ఆయన ధరించిన ఉంగరం అని ప్రముఖ జ్యోతిష్య పండితులు వేణుస్వామి అన్నారు.ఆ ఉంగరాల చుట్టూ రకరకాల ఊహాగానాలు, బోల్డన్ని జ్యోతిష్య పరమైన విశ్లేషణలు చూస్తూనే వున్నాం. సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచనల మేరకు ఓ పండితుడి సలహా తీసుకుని పవన్ కళ్యాణ్ ఆయా ఉంగరాల్ని ధరిస్తున్నట్లుగా ఓ ప్రచారం వుంది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ జ్యోతిష పండితుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ జన్మ నక్షత్ర రీత్యా సర్పాకారంలో పవన్ కళ్యాణ్ చూపుడు వేలికి వున్న ఉంగరం అస్సలేమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు..రానున్న రోజుల్లో వ్యతిరేక ఫలితాలు వుంటాయనీ, కేసుల పాలయ్యే అవకాశం వుంటుందని వేణు స్వామి హెచ్చరించారు. విశాఖ ఘటనతో వచ్చిన పాజిటివ్ పబ్లిసిటీ కంటే, నెగెటివిటీ ఎక్కువగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనమన్నది ఆయన వాదన.వెంటనే, పవన్ కళ్యాణ్ ఆ ఉంగరం తీసెయ్యాలన్నది వ్యక్తిగతంగా తాను ఆయనకు ఇస్తోన్న సలహా అని వేణు స్వామి అన్నారు..మరి ఈ విషయం పై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news