విజయ్ సాయి రెడ్డి రికమెండేషన్ తో రాత్రికి రాత్రి జగన్ అతిపెద్ద నిర్ణయం ??

-

వైసీపీ పార్టీకి సంబంధించి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో పార్టీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి రికమండేషన్ మేరకు రాత్రికి రాత్రి జగన్ అతి పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో ప్రస్తుతం వార్తలు వినబడుతున్నాయి. ఢిల్లీ వ్యవహారాలన్నీ విజయ సాయి రెడ్డి పార్టీ తరఫున చూసుకుంటున్న ఈ విషయం అందరికీ తెలిసినదే. Image result for vijaysai reddy ys jaganనాలుగు రాజ్యసభ స్థానాల్లో వైసిపి అధినేత జగన్ ఇప్పటికే కొంతమందిని పంపించడానికి డిసైడ్ అయినట్లు వాళ్ళ పేర్లను ప్రకటించడమే తరువాయి భాగం అన్నట్లు పార్టీలో వార్తలు వినబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో విజయసాయిరెడ్డి సిఫార్సు మేరకు బీసీ కోటాలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన బీద రవిచంద్ర పేరు జగన్ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం, ఇటీవలే పార్టీలో చేరేటప్పుడు రాజ్యసభ స్థానాన్ని ఇస్తామని హామీ ఇవ్వడంతో బీద రవిచంద్రకు దాదాపు ఖరారయిందంటున్నారు. ప్రస్తుతానికి పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లే వినబడుతున్న ముగ్గురు పేర్లు ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీ, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయిన అయోధ్య రామిరెడ్డి మరియు ఎస్సీ మహిళకు జగన్ ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్లు పార్టీలో టాక్. 

Read more RELATED
Recommended to you

Latest news