టీడీపీ ఎమ్మెల్యే దంపతుల సాహసం… వ్యాక్సిన్ వాలంటీర్లుగా

-

భారత్ బయోటెక్ కోవ్యాగ్జిన్ ట్రయల్ రన్ కు వాలంటీర్లుగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు చేరారు. ఫస్ట్ ట్రయల్ లో కోవ్యాగ్జిన్ టీకాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన సతీమణి గద్దె అనురాధ వేయించుకున్నారు. సెకండ్ ట్రయల్ లో జనవరి 4వ తేదీన టీకాను గద్దె రామ్మోహన్ దంపతులు వేయించుకుంటారు. మొదటి టీకా వేయించుకున్న తర్వాత అంతా బాగానే ఉందని గద్దె దంపతులు వెల్లడించారు.

టీకా వేయించుకొన్న అనంతరం రెగ్యులర్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే గద్దె దంపతులకు వైద్యులు సూచనలు చేసారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు తాను కూడా సేవ చేశాననే సంతృప్తి మిగులుతుందని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మన దేశంలో మూడో దశ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో పలువురు ప్రముఖులు భాగం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news