పవన్ కి బిజెపి పెద్దల క్లాస్…!

-

“రాజధాని అనే10 లక్షల కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చంద్రబాబు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమే. విలువలు, సిద్ధాంతాలు లేని వ్యక్తులు వ్యవస్థలన్నిటిని బలితీసుకుంటారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ఇలాగే సాగింది. దానికి ఫుల్ స్టాప్ పడిందన్న విషయం తెలుసుకోలేక పోవడం విషాదం. దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు.

రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బిజెపి పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడు.” అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్లు చేసారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళే ముందు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

పోలీసుల దాడుల్లో గాయపడిన రాజధాని రైతులు, మహిళలతో మాట్లాడిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోను అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలు చేసిన అనంతరం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళడంతో ఒక్కసారిగా ఎం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో, పవన్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే విజయసాయి రెడ్డి ఈ సంచలన ట్వీట్లు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news