అచ్చెన్న ఇలా బయటపడొచ్చేమో : విజయసాయి

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు ఈయనది. వైసీపీలో కీలక నేతగా ఉంటూ.. నిత్యం ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ఈయనకి బాగా అలవాటు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై, టీడీపీ నేతల అరెస్టులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, అచ్చెన్నాయుడు బయటకి ఎలా రావాలో టీడీపీ నేతలకు సలహా ఇస్తూనే.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘‘అచ్చెన్న కచ్చితంగా బాబు గారి బినామీనే. ఆయన ద్వారానే భూముల కొనుగోళ్లు, వ్యాపారాల్లో వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టారని సొంత పార్టీలో చర్చించుకుంటున్నారు. బాబు రాయమంటేనే సిఫారసు లేఖలు రాసానని అంగీకరించి, గుట్లు మట్లన్నీ చెప్పేస్తే కేసు నుంచి బయటపడొచ్చేమో చూడండి అచ్చెన్నా’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news