చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజుల నుంచి సంచలనం సృష్టిస్తున్న అంతర్వేది ఘటన విషయంలో ఇప్పుడు అధికార విపక్షాలు మాటల దాడులను కొనసాగిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అంతర్వేది ఘటన వెనుక ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన అనుచరుల కుట్ర ఉందని విజయసాయి రెడ్డి ఆరోపణలు చేసారు.

ఈ ఘటనలో పెదబాబు, చినబాబు హస్తం ఉందన్న విషయం విచారణలో బయటపడుతుందని ఆయన స్పష్టం చేసారు. హైదరాబాద్, గుంటూరు వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు చేసారు. కాగా ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news