గాడి తప్పుతున్న ‘బండి’..ఇంత మార్పు ఎలా వచ్చింది?

-

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బలం తగ్గుతుందా? కాంగ్రెస్ రేసులోకి వచ్చాక టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే శక్తి బి‌జే‌పికి తగ్గిందా? అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీలో కాస్త ఊపు తగ్గినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకు తెలంగాణలో టి‌ఆర్‌ఎస్‌తో బి‌జే‌పినే ఢీ అంటే ఢీ అనేలా రాజకీయం చేసింది. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక బి‌జే‌పి మరింత పుంజుకుంది. ఊహించని విధంగా దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ని ఓడించడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో దాదాపు టీఆర్ఎస్‌ని ఓడించినంత పని చేయడంతో బి‌జే‌పికి అనూహ్యంగా కొత్త బలం వచ్చింది.

ఇక టీఆర్ఎస్‌కు బి‌జే‌పినే ప్రత్యామ్నాయం అనే విధంగా పరిస్తితి మారింది. పైగా బడా బడా నాయకులు బి‌జే‌పిలోకి రావడంతో, పార్టీకి తిరుగులేదని అంతా అనుకున్నారు. ఇక ఈటల రాజేందర్ లాంటి బడా నాయకుడు బి‌జే‌పిలోకి వచ్చాక రాజకీయం మరింత మారింది. కానీ ఎప్పుడైతే పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బరిలో దిగారో అప్పటినుంచి రాజకీయం బాగా మారింది. రేవంత్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్‌ని రేసులోకి తీసుకొచ్చేశారు. అలాగే అధికార టి‌ఆర్‌ఎస్‌పై రేవంత్ గట్టిగా పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

కానీ రేవంత్ మాదిరిగా బండి..టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్ళడం ఈ మధ్య తగ్గించారు. అనూహ్యంగా బి‌జే‌పి దూకుడు తగ్గింది. ఇలా బి‌జే‌పిలో మార్పు రావడంతో కాంగ్రెస్‌కు బాగా ప్లస్ అవుతూ వచ్చింది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో కూడా బండి కాస్త గాడి తప్పినట్లే కనిపించింది. దీంతో బి‌జే‌పి పికప్ అవ్వడం ఆగింది.

Read more RELATED
Recommended to you

Latest news