నాకు చెప్పలేవా…?: వైసీపీ ఎంపీపై ఎమ్మెల్యే ఫైర్…!

-

ఏపీలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇప్పుడు సంచలనం అయ్యాయి. ఎక్కడో ఒక చోట వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాకినాడలో డీఆర్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు బయటపడ్డాయి. టిడ్కో ఇళ్ళ నిర్మాణాల విషయంలో అక్రమాలు జరిగాయని వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

నాకు ఎందుకు చెప్పలేదు అంటూ బోస్ పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన ఈ సమావేశంలో కేకలు కూడా వేయడం గమనార్హం. మేడ్ లైన్ ప్రాంతంలో అక్రమ కట్టడాల కారణంగా కాకినాడ సిటీ మునిగిపోయింది అని బోస్ అనగా ఒకే పార్టీలో ఉన్నప్పుడు నాకు చెప్పవచ్చు కదా అని బోస్ పై ఎమ్మెల్యే అరిచారు. మంత్రి కన్నబాబు జోక్యం చేసుకుని గొడవ ముగించారు.

Read more RELATED
Recommended to you

Latest news