గెలుపు మూడ్‌లోకి వెళ్లిపోయిన వైసీపీ…జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్‌లో ఏం జరిగింది…? వీడియో

-

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ … వైఎస్సార్సీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా వారిరువురూ ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ గురించి చర్చించారు. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ ఆఫీసుకు వచ్చిన జగన్.. ఆయన బృందంతో సమావేశమయ్యారు.

వైఎస్సార్సీపీ కోసం ప్రశాంత్ కిషోర్ గత రెండేళ్ల నుంచి పని చేస్తున్నారు. రావాలి జగన్.. కావాలి జగన్ క్యాంపెయిన్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కృషి ఉంది. దీంతో జగన్.. ప్రశాంత్ కిషోర్ కు, ఆయన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు ఖచ్చితమని ప్రశాంత్ కిషోర్ ధీమాతో ఉన్నారు.



2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తంపు పొందారు. ఈనేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే ధ్యేయంగా పని చేశారు.

YS Jagan thanked prasant kishore
YS Jagan thanked prasant kishore

Read more RELATED
Recommended to you

Latest news