లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది.. విజయసాయి రెడ్డి కౌంటర్

-

జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గులతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ? అంటూ ట్వీట్ చేశారు.

మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని మాపై కుట్ర చేశారు. ఇప్పుడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది.. అంటూ టీడీపీ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు.

ఆయన ప్రతి రోజు ట్విట్టర్‌లో ఎవరో ఒకరికి కౌంటర్ ఇస్తూనే ఉంటారు. తాజాగా లోకేశ్ బాబుకు ఇచ్చారు. అంతే కాదు.. విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డ్యాటా, అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారని.. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు అంటూ ట్వీట్ చేశారు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం మొదటిసారి వింటున్నామంటూ సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి.

చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి ఉమా?

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమపై కూడా విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గులతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ? అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news