దొరగారికి ఢిల్లీ కుర్చీమీద, దోచుకోవడం మీదే ధ్యాస….కేసీఆర్ పై వైఎస్ షర్మిళ సంచలనం

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్లర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిళ. రైతుల మరణాలపై ఆమె స్పందించారు. కేసీఆర్ కు ఢిల్లీ కుర్చీనే కానీ.. రైతులపై ప్రేమ లేదని విమర్శించారు.

వైఎస్ షర్మిళ ట్విట్టర్ లో ఈ విధంగా వ్యాఖ్యానించారు.  రైతులకు పనికి రాకున్నా, నిర్వాసితులు నిప్పంటించుకుని చచ్చినా.. మీ కమీషన్లకు ఢోకా రాకుండా.. లక్షల కోట్ల అప్పుతెచ్చి.. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాజెక్టు కట్టారని.. ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో ఎలా కలుపుతున్నారో చూపించే కేసీఆర్ గారికి, బంగారు తెలంగాణలో రైతులు బతకలేక చస్తున్నా పట్టించుకునే తీరికలేదని విమర్శించారు. నిన్న నలుగురు, ఈరోజు ముగ్గురు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే కానీ… బంగారు భారతదేశం చేయడానికి బయలిదేరుతున్న దొరగారికి మాత్రం రైతు బతుకులని బాగుచేద్దాం అన్న మనసొస్తలేదని విమర్శించారు. ఆలోచనంతా మాటలతో మోసం చెయ్యడం మీద. ధ్యాసంత ఢిల్లీ కుర్చీ మీద. మనసంతా దాచుకోవడం మీదే ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news