రాహుల్ గాంధీ సభకు వెళ్తే పథకాలు ఆపేస్తారట…

-

అధికార పార్టీ BRS నుండి బయటకు వచ్చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు లు తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా మొదటగా ఖమ్మం జిల్లా నేత పొంగులేటి జులై 2వ తేదీన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షములో హస్తం కండువాను వేసుకోనున్నారు. కాగా ఈ సభకు ప్రజలను ఎవ్వరినీ వెళ్లకుండా అధికార పార్టీ ఆంక్షలు పెడుతోందని పొంగులేటి చెప్పారు. ఖమ్మంలో జరగనున్న రాహుల్ గాంధీ సభకు ఎవరైనా వెళ్తే వారికి ప్రభుత్వం నుండి వచ్చే పధకాలు దక్కకుండా చేస్తామని బెదిరిస్తున్నారట. ఇంకా ఈ సభకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులను సైతం ఇవ్వకుండా అడుగడుగునా ఈ సభ జరగకుండా చేయడానికి అడ్డు పడుతున్నారని పొంగులేటి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మాకు బలం లేదని కామెంట్ చేసిన అధికార పార్టీ ఇప్పుడు మా మీటింగ్ కోసం ఎందుకు భయపడుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news