ఇది కదా వార్తంటే: ఛార్జర్ వైర్ తో భర్తను చంపిన భార్య…

-

సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజమే. కానీ వీటిని పట్టించుకుని స్వార్థంగా తీసుకుని.. ఇగోలకు పోయి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు చాలామందే ఉన్నారు. నిత్యం ఇలాంటి తరహా ఘటనలో టీవీలలో పేపర్ లలో చూస్తూనే ఉన్నాము. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక భర్తను భార్య హత్య చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా ప్రకాష్ రావుపేటకు చెందిన రమణారావు అనే భర్త నిత్యం రాత్రిళ్ళు మద్యం తాగి వచ్చి భార్యను కొడుతూ ఉండేవాడట. కానీ భార్య ఎంత బలహీనం అయినప్పటికీ నిత్యం భరించడం ఏ భార్య వలన కూడా కాదు. ఇక మూడు రోజుల క్రితం కూడా ఇదే తరహాలో తాగి వచ్చిన భర్త తనను కొట్టడంతో కోపంతో ఊగిపోయిన భార్యామణి చార్జర్ వైర్ తో అతని మెడకు గట్టిగా పట్టుకుని బిగించడంతో క్షణాలలోనే అనంతలోకాలకు చేరుకున్నాడట భర్త.పైగా ఈ విషయాన్ని గుండెపోటుతో చనిపోయాడని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ అంత్యక్రియల సమయంలో కాటికప్ర్రికి అనుమానం వచ్చి పోలీస్ లకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news