క్యూ న్యూస్ పై దాడి… పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

-

ప్రశ్నించే గొంతుకను అణిచివేసే ప్రయత్నం మన రాష్ట్రంలో జరుగుతుందని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. క్యూ న్యూస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్యూ న్యూస్ సంస్థ పై వారి సిబ్బంది పై జరిగిన దాడి హేయమైన చర్య అని తెలిపారు.

ఉన్నది ఉన్నట్టు… విన్నది వినట్టు ప్రజల పక్షాన ఉంటూ వారి కోసం పోరాడుతున్న మల్లన్న ను నేరుగా ఎదుర్కొనే శక్తి లేకనే ఇలాంటి కొందరు ఈ వికృత చేష్టాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికార పార్టీ కి చెందిన నాయకులే ఈ దాడిని చేయించి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లన్న చేయబోయే న్యాయ పోరాటానికి ఖచ్చితంగా తన మద్దతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news