బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..ఈ నెల 18నే ముహూర్తం?

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకోసం పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకునేందుకు ఈనెల 10వ తేదీ నుంచి వరుసగా బేటీలు జరపనున్నట్లు తెలుస్తోంది.

అటు ఈ నెల 18న అమిత్ షా తో భేటీ తర్వాత స్పష్టమైన నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. కాగా ఇటీవల పార్టీ మారనంటూ ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కాగా రెండు రోజుల కిందట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మం ప్రజలు తనకు అండగా ఉంటారని… జగన్ వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత ఏడాది కాలంగా ఖమ్మంలో తనకు అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news