మహేశ్ పై చాలా ఆశలు పెట్టుకున్న పూజ హెగ్డే ..!!

-

ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. ఇక ఎవరైనా మంచి డైరెక్టర్ ను ఇంప్రెస్ చేస్తే చాలు ఆయన సినిమా తీస్తున్నప్పుడల్లా వారిని హీరోయిన్స్ గా పెట్టుకుంటారు. అలాంటి పనే హీరోయిన్ పూజ హెగ్డే చేస్తోంది.తాను గురూజీ ని గట్టిగా నమ్ముతోంది.

తెలుగు సినిమాలో పూజా  కనిపించి చాలా కాలం అయ్యింది. అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ లో నటించినా భారీ పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ ఫ్లాపవ్వడంతో తన గ్రాఫ్ తగ్గింది. పూజా ఇప్పుడు మహేష్ బాబు -త్రివిక్రమ్ ల SSMB28తో తిరిగి మళ్లీ లైన్ లో పడేందుకు చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ ఈపాటికే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ రకరకాల కారణాలతో అంతకంతకు ఆలస్యమవుతోంది.

ఇక కృష్ణ గారి మరణంతో మరో సారి ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం త్రివిక్రమ్ చాలా కష్ట పడుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ మొత్తం దగ్గరుండి చూసుకుంటూ పూర్తి చేసుకున్నారు. ఇక వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.హీరోయిన్ పూజ హెగ్డే కూడా ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news