బండ్ల సంచలనం: పూరి మోసం చేస్తున్నది వీరినే.!

-

లైగర్` వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నష్టాలు భర్తీ చేయాలని దర్శకుడు పూరిజగన్నాధ్ పై బయ్యర్లు తెస్తోన్న ఒత్తిడిపై పూరి జగన్నాథ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. కాని బయ్యర్లు పూరిని ఎలాగైనా బెదిరించి డబ్బులు రాబట్టు కావాలని  చాలా రకాల గా ప్రయత్నాల చేస్తున్నారు. దీని పై మళ్లీ పూరి ఒక లెటర్ ద్వారా తనలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఆ లెటర్ లో నేను ఎప్పుడైనా మోసం చేస్తే, అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ ని తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు.మళ్ళీ  నేను ఇంకో సినిమా తీస్తా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడ నుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా” అంటూ పూరి వారికి గాట్టిగా పంచ్ఇచ్చాడు                   

ఇప్పుడు ఈ లెటర్ పై బండ్ల గణేష్ అదే మాటర్ ఉంచుతూ, పూరి తన ఫ్యామిలీ తో వున్న ఫోటో ను  జత చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై సోషల్ మీడియా లో రకరకాలు గా స్పందిస్తున్నారు. గతంలో పూరి కొడుకు చోర్ బజార్ సినిమా ఫంక్షన్ కు వెళ్ళిన బండ్ల గణేష్ ఫ్యామిలి ని పట్టించు కోవడం లేదని వేదిక పై విమర్శించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది మీడియాలో హాట్ టాపిక్ అయింది. దాన్ని దృష్టి పెట్టుకొని మళ్లీ బండ్ల పూరి  ఎవరిని మోసం చేయలేదు కాని ఫ్యామిలీని మాత్రం మోసం చేస్తున్నాడని ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version