షర్మిలకు జగన్ ఏ అన్యాయం చేయలేదు: పోసాని

-

తెలంగాణాలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆమె జగన్ పై కోపంగా పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటే మరికొందరు ఆమెకు సీఎం కావాలనే కోరిక ఉందని అందుకే పార్టీ పెడుతున్నారని అంటున్నారు. కాదు కాంగ్రెస్ ని దెబ్బకొట్టడానికి అంటూ కొందరు కామెంట్స్. ఈ తరుణంలో వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేసారు.

చెప్పింది చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు గుర్తించారు అని, అన్నారు. అందుకే పంచాయతీ ఎన్నికలలో అఖండ విజయాన్ని అందించారు అని ఆయన చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికలలో కూడా వైస్సార్సీపీ పార్టీని ప్రజలు గెలిపించాలి అని కోరారు. జగన్ పరిపాలన పై చంద్రబాబు అనేక విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. జగన్ ను ఫేక్ ముఖ్యమంత్రి అంటున్న చంద్రబాబు .. ఏవిధంగానో నిరూపించండి అని సవాల్ చేసారు.

చంద్రబాబు పులివెందుల లో రౌడీ రాజ్యం నడుస్తుంది అని అసత్యాలు పలుకుతున్నారు అని, ఒకసారి అక్కడికి వెళ్లి వాస్తవాలు చూడండి అని హితవు పలికారు. మామను వెన్నుపోటు పొడిచి వచ్చిన మనిషిని కదా రౌడీ అంటారు అంటూ ఆయన ప్రశ్నించారు. షర్మిల కు జగన్ ఎటువంటి అన్యాయం చేయలేదు అని, చేసి ఉంటే.. ఎపిలోనే పోటీకి వచ్చే వాళ్లు కదా అని ప్రశ్నించారు. ఆమె ఎదగాలనే తెలంగాణ లో పార్టీ పెట్టుకుంటున్నారు.. తప్పేంటి అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news