జగన్ కి షాక్.. మోదీకి జై కొట్టిన మరో వైసీపీ కీలక నేత..!

-

వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ పై హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తన ఇంటిపై దాడి చేశారని, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పీవీపీపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. తన ఇంటికి వచ్చిన బంజారాహిల్స్ పోలీసులపై పెంపుడు కుక్కులను వదిలారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

పోలీసులు ఆయనకోశం గాలిస్తున్న సమయంలో ప్రధాని మోదీని ప్రశంసిస్తూ పీవీపీ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. “శాంతి సందేశం పంపిస్తున్న చైనా ! హిందీ, చీని భాయి భాయి అని నెహ్రు గారిలా మోసపోకుండా డిజిటల్ స్ట్రైక్స్ మరియు దౌత్యం  ద్వారా వెనక్కి నెట్టిన నరేంద్ర మోదీ గారికి దేశమంతా జేజేలు” అని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు పీవీపీ.

Read more RELATED
Recommended to you

Latest news