మీ సంగతి తెలిసే మీ నీచ చరిత్రకు చరమగీతం పాడారు : పొతుల సునీత

-

రాష్ట్రంలో హంతకుడు, దగాకోరు, వెన్నుపోటు దారుడు చంద్రబాబు అని అందరికీ తెలుసు అని వైసీపీ మహిళా అధ్యక్షురాలు పొతుల సునీత అన్నారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రెండు ఎకరాల నుంచి ఇంత అస్తి ఎలా సంపాదించారు…? మీ సంగతి తెలిసే మీ నీచ చరిత్రకు చరమగీతం పాడారు. రాష్ట్రంలో సంక్షేమపాలన నడుస్తుంటే టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా..’సామాజిక విప్లవకారుడులా జగన్ సామాజిక న్యాయం చేస్తుంటే వారికి వెన్నులో వణుకు పుడుతోంది. అయ్యన్న పాత్రుడు నువ్వు నోరు అదుపులో పెట్టుకో. లేదంటే బడుగు బలహీనులు నీకు బడిత పూజ చేస్తారు. అనిత మాట్లాడితే భారతమ్మ గురించి ప్రస్తావిస్తోంది…రిషికొండ కి ఆమెకి ఏమీ సంబంధం..? ఇలానే మాట్లాడితే మహిళలంతా నీకు బుద్ది చెప్తారు.

Opinion: Mindless Talk By YSRCP Leader

ప్రజలు వీళ్ళకి ఎన్ని సార్లు బుద్దించెప్పినా మార్పు రావడం లేదు. యనమల ఒక బీసీ నాయకుడిగా ఇన్నాళ్లు ఎలా కొనసాగాడు అనేది అర్థం కావడం లేదు. వీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పరిపాలన రాజధాని విశాఖ వెళ్లి తీరుతుంది. అమరావతి రైతుల యాత్ర దొంగ యాత్ర అని తేలిపోయింది. అమరావతి ప్రజల పైనా చంద్రబాబుకి ప్రేమ లేదు. 2024లో ప్రజలు వీళ్ళకి మరో మారు బుద్ది చెప్పబోతున్నారు. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి పరిపాలనలో బీసీలకు ఏమీ చేసావో చర్చకు చంద్రబాబు సిద్దమా…? నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదు..దమ్ముంటే చర్చకు రా. మరోమారు వ్యక్తిగత దూషణలకు దిగితే ప్రజలు బుద్ది చెప్తారు.’ అని ఆమె మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news