ఘనంగా ‘కేజీఎఫ్2’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా ప్రభాస్..!

-

ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండటంతో పాటు నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే అనే ఇంపాక్ట్ తొలుత ‘బాహుబలి’ పార్ట్ టూ చిత్రానికి క్రియేట్ అయింది. ఆ తర్వాత ‘కేజీఎఫ్’ సినిమాకు కలిగింది. ప్రశాంత్ నీల్ – యశ్ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్’ చాప్టర్ వన్ సూపర్ సక్సెస్ కాగా, చాప్టర్ 2 కోసం ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వచ్చే నెల 14న చిత్రం విడుదల కాబోతున్నది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చిత్రం నుంచి ‘తుఫాన్’ విడుదల చేయగా, అది తుఫాన్ లాగే హయ్యెస్ట్ వ్యూస్ అతి తక్కువ సమయంలోనే సంపాదించుకుంది.

 

కొవిడ్ వలన చిత్ర విడుదల పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ సారి మాత్రం అలా పోస్ట్ పోన్ అయ్యే చాన్సెస్ లేవు. కాగా, చిత్ర విడుదలకు టైమ్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన మేకర్స్ ఫోకస్ పెడుతున్నారు. ప్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న మేకర్స్.. ఈ వేడుకకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో ప్రభాస్ ‘సలార్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రశాంత్ ప్రభాస్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రావాలని రిక్వెస్ట్ చేసే చాన్సెస్ ఉన్నాయని కోలీవుడ్ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో భారీగా ప్రమోట్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు వినికిడి. అయితే, ఈ విషయమై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. చూడాలి మరి రాఖీ భాయ్ కోసం రెబల్ స్టార్ వస్తారో లేదో..

 

Read more RELATED
Recommended to you

Latest news