600కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ చిత్రం..

-

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్, ఆ తర్వాత చేస్తున్న చిత్రాలన్నింటినీ భారీ బడ్జెట్ లోనే తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ తో చేస్తున్న సైంటిఫిక్ చిత్రం మరోటి. ఈ మూడు చిత్రాలలో రాధేశ్యామ్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టకపోయినప్పటికీ మిగతా వాటికి మాత్రం ఓ రేంజిలో నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి 500కోట్ల వరకు పెడుతున్నారట. అదే నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమాకి 600 కోట్ల వరకూ పెడుతున్నారట. ఈ మేరకు చిత్ర నిర్మాత అశ్వనీదత్ వెల్లడి చేసాడు. మొదటి నుండి ఈ సినిమాపాన్ వరల్డ్ అని చెబుతూనే ఉన్న సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో సాగే ఈ కథ అత్యంత భారీగా తెరకెక్కుతోందట. ఆదిపురుష్ చిత్ర షూటింగ్ పూర్తయ్యాకే నాగ్ అశ్విన్ తో సినిమా మొదలవుతుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news