ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ప్రభాస్ రూ. కోటి విరాళం

-

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు టాలీవుడ్ స్టార్ హీరో, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విరాళం ప్ర‌క‌టించారు. వ‌ర‌ద బాధితుల కోసం… ఏకంగా కోటి రూపాయల‌ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు హీరో ప్ర‌భాస్‌. ఈ మేర‌కు ప్ర‌భాస్ ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ గుర్తు చేసుకున్నారు.

prabhass
prabhass

ఇక ఇప్ప‌టికే.. ఎన్టీఆర్‌, చిరంజీవి, అల్లు అర్జున్‌, ఇత‌ర స్టార్ హీరోలు, నటులు వ‌ర‌ద బాధితుల‌కు ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించారు.అటు ఏపీ ప్ర‌భుత్వం కూడా… వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా నిలుస్తోంది. వ‌ర‌ద‌ల్లో ఇళ్లు కోల్పోయిన వారికి నూత‌నంగా ఇండ్లు నిర్మించేందుకు ముందుకు వ‌చ్చింది స‌ర్కార్‌. కాగా.. ఏపీ లో గ‌త 15 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్ష‌లు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే… ఏపీ ప్ర‌జ‌లు వ‌ర‌ద ముంపున‌కు గుర‌య్యారు. ఈ వ‌ర‌ద‌ల్లో చాలా మంది నిరాశ్ర‌యులు కాగా… కొంత మంది మ‌ర‌ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news