జోకర్‌ను నాయకుడిగా చేస్తే మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమే : ప్రకాశ్‌ రాజ్‌

-

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలల నుంచి జాతుల వైరంతో రగిలిపోతుంటే పార్లమెంటులో నాయకులు నువ్వా నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారంపై మాట్లాడలేదని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. జోకర్‎ను నాయకుడిని చేస్తే మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమే అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

Prakash Raj - Wikipedia

మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ దేశానికి తగిలిన గాయాలు రాచపుండులా మారుతాయన్నారు. ప్రస్తుతం మనం, మన దేశం అలాంటి పరిస్థితుల్లోనే ఉందన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ తాను ఊరికే కూర్చోలేనన్నారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం రచయితలందరూ సంఘటితమైనదే ఈ సమూహ ఫోరమ్ అన్నారు. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలందరి ఉమ్మడి స్వరమన్నారు. సహనశీలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక ఇది అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news