త్వరలో దేశవ్యాప్తంగా ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు..!

-

దేశవ్యాప్తంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టడానికి కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కేంద్ర మంత్రిత్వశాఖలోని అన్ని పరిపాలనా వ్యవహారాల సంస్థలను ఆదేశించాలని ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సలహా ఇచ్చింది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల అమర్చుకోవడం ద్వారా విద్యుత్ పంపిణీ కంపెనీల ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరిస్తోంది విద్యుత్ మంత్రిత్వశాఖ. ఈ ప్రీపెయిడ్ మీటర్స్ ప్రీపెయిడ్ మొబైల్స్ ఎలా పని చేస్తాయో అలానే పని చేస్తాయి. ఎంత విద్యుత్ అవసరమైతుందో అంతే విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీపెయిడ్ మీటర్లను ఉపయోగిస్తున్నారు. ఇందుకు దీనిని రీఛార్జ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్ అమలు కానుంది. అంటే విద్యుత్ వినియోగదారులందరి ఇళ్లలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఇన్ స్టాల్ చేయబడతాయన్నట్లే..

బ్యాంకు హామీల కోసం పట్టుబట్టకుండా ప్రీ పెయిడ్ పవర్ మీటర్లకు ముందస్తు చెల్లింపులు చేయాలని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర శాఖలను కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన వివరణ తర్వాత ఈ సలహా వచ్చింది. అదే సమయంలో అకౌంటింగ్ మేనేజ్‌మెంట్‌ను నిర్ధారించాలని ప్రతి ఒక్క విభాగాన్ని కోరారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారం, అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు విద్యుత్ పంపిణీ సంస్థలను ఆర్థిక స్థిరత్వం మార్గంలో తీసుకురావడానికి, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిర్ధారించడంలో ముఖ్యమైనవిగా నిరూపించడమే కాకుండా, ఇలాంటి వ్యవస్థను సృష్టించడానికి రాష్ట్రాలకు ఒక నమూనాగా కూడా పనిచేస్తాయి. వ్యవసాయ వినియోగదారులు మినహా విద్యుత్ వినియోగదారులందరికీ దశలవారీగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అందించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news