సింగర్ కేకే మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

-

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కన్నాధ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు.
కేకే గా చిరపరిచితమైన ఆయన కోల్కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. అనంతరం హోటల్ కు చేరుకున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సీఎంఅర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కేకే మరణించినట్లు ధ్రువీకరించారు. కేకే మృతితో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు షాక్ కు గురయ్యారు.

తమ అభిమాన సింగర్ ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్ళాడు అని సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. క్రికెటర్ సెహ్వాగ్, నటుడు అక్షయ్ కుమార్ తో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కేకే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు.” కేకే పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి. కేకే కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.” అని ప్రధాని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news