జూలై 4న భీమవరానికి ప్రధాని నరేంద్ర మోడీ

-

చాలా రోజుల తర్వాత అంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇటీవలే హైదరాబాద్ కు వచ్చిన ఆయన.. త్వరలోనే ఏపీలో కూడా పర్యటించబోతున్నారు. ఏపీలో మోడీ పర్యటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ప్రధాని మోడీ వస్తారని వెల్లడించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఇది అధికారిక కార్యక్రమం.

ప్రధాని హోదాలో ఆయన పాల్గొననున్నారు. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతల కోసం కొంత సమయం కేటాయించి.. వారిని కలుస్తారని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలో కూడా ఇదే జరిగింది. ఐ ఎస్ బి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని.. బేగంపేట ఎయిర్ పోర్ట్ లోనే బిజెపి నేతలను కలిశారు. అనంతరం స్వాగత సభలో పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. భీమవరం పర్యటన కూడా ఇంచుమించు ఇలాగే ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news