IPL DC vs LSG : రాణించిన పృథ్వీ షా.. ల‌క్నో టార్గెట్ 150

-

ఐపీఎల్ 2022 లో భాగంగానే నేడు ఢిల్లీ క్యాపిటల్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య 15 వ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ల‌క్నో.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ (4) తో నిరాశ ప‌ర్చాడు. కానీ మ‌రో ఓపెన‌ర్ పృథ్వీ షా (61) రాణించాడు. కేవ‌లం 31 బంతుల్లోనే 61 ప‌రుగులు చేశాడు. అందులో 9 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. పావెల్ (3) కూడా చేతులేత్తేశాడు.

దీంతో రిషబ్ పంత్ (39 నాటౌట్) స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ( 36 నాటౌట్) నిల‌కడ‌గా రాణించారు. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి.. 149 ప‌రుగులు చేసింది. లక్నో బౌల‌ర్లు.. ర‌వి బిష్ణోయ్ 2, కృష్ణ‌ప్ప గౌత‌మ్ ఒక వికెట్ తీసుకున్నారు. కా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం సాధించాలంటే.. 150 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది. ల‌క్నో బ్యాటింగ్ ఆర్డ‌ర్ ముందు ఈ టార్గెట్ చిన్న‌బోయే అవ‌కాశాలు ఉన్నాయి. కెప్టెన్ కెఎల్ రాహుల్, డి కాక్ తో పాటు వ‌రస హాఫ్ సెంచరీల‌తో జోరు మీద ఉన్న దీప‌క్ హుడలు రాణిస్తే. విజ‌యం ల‌క్నోదే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news