Project-K అప్‌డేట్ ఇచ్చేసిన డైరెక్టర్..ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తు్న్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘Project-K’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ అప్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా నాగ్ అశ్విన్ ను తాము గుర్తున్నామా? అని ప్రశ్నించాడు. దాంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏకంగా ప్రాజెక్ట్ -కె అప్ డేట్ ఇచ్చేశాడు.

ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవల విడుదలైంది. అయితే, ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, ‘రాధేశ్యామ్’ తర్వాత రాబోయే చిత్రం ‘ప్రాజెక్ట్-కె’ నే అని క్లారిటీ ఇచ్చేశారు దర్శకులు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ లు ఈ సినిమాలో నటించనున్నారు.

ఇకపోతే నాగ్ అశ్విన్ తన ట్వీట్ లో ‘ప్రాజెక్ట్ -కె’కు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిపాడు. ‘హాయ్ నాగ్ అశ్విన్ అన్నా..గుర్తున్నామా’ అని ఓ నెటిజన్ ట్వీట్ కు స్పందించిన నాగ్ అశ్విన్..‘‘గుర్తున్నారు..ఇప్పుడే ఒక షెడ్యూల్ పూర్తయింది. ప్రభాస్ ఇంట్రో బిట్ కూడా పూర్తయింది..జూన్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. రిలీజ్ ఆర్డర్ లో మనం లాస్ట్ ఉన్నాం.. తరుచూ అప్ డేట్స్ ఇవ్వడానికి టైం ఉంది..ప్రాజెక్ట్ -కె కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం’’ అని ట్వీట్ చేశాడు నాగ్ అశ్విన్.. దాంతో ప్రభాస్ అభిమానులు సంతోషపడుతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news