రేపు ఉదయం 10:30 గంటలకు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు.

-

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తూ గుండె పోటుతో మరణించారు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో యావత్ కర్నాటక శోకసంద్రంలో మునిగింది. కన్నడ ఫిలిం ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, జూ.ఎన్టీఆర్, రానా, శ్రీకాంత్ వంటి తెలుగు సినీ ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయానికి నివాళులు అర్పించి భావోద్వేగానికి గురయ్యారు. తమకు పునీత్ తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.

కాగా పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపు ఉదయం 10:30 గంటలకు జరుగనున్నాయి. నిజానికి ఈ రోజు సాయంత్రమే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఉంటాయని కర్నాటక ప్రభుత్వ ప్రకటించినప్పటికీ.. పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె ధ్రుతి అమెరికా నుంచి రావడం ఆలస్యం కావడంతో రేపు అంత్యక్రియలు జరుగనున్నాయి. సంప్రదాయం ప్రకారం రాత్రి పూట అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో రేపటికి వాయిదా పడ్డాయి. రేపు కంఠీరవ స్టూడియోలో తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే అంత్యక్రియలు జరుపనున్నాయి.

అంతకు ముందు ప్రజల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని కంఠీరవ స్టేడియానికి తరలించారు. కర్నాటక వ్యాప్తంగా ఉన్న పునీత్ రాజ్ కుమార్ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి నివాళులు అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news